ఎంతొ శ్రమించి "శారద" రచనల్ని మరల బతికించిన ....."శారద సాహిత్య వేదిక" తెనాలి మిత్రులకు, పర్స్పెక్టివ్స్ ఆర్.కె గారికి....హృదయపూర్వక ధన్యవాదాలు. Tribute to my fav writer SARADA (S.Natarajan) [1924-1955]. శారద మారు పేర్లు: శారద , యెస్.నటరాజన్, నటరాజన్, యెస్.యెన్.రాజన్, శక్తి, గంధర్వుడు, నాగార్జునుడు, సత్యాన్వేషి... etc....
Friday, 13 March 2015
Tuesday, 14 October 2014
సాహీతీ వి'శారద' - టీవీయస్.శాస్త్రి
Courtesy: Thanks to TVS Sasthry garu and Gotelugu web magazine.
link: http://www.gotelugu.com/issue48/1353/telugu-columns/sahitee-vi-sarada/

తెలుగు సాహిత్యంలో 'శారద' కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దురదృష్టమేమంటే, 'శారద' అంటే చాలా మందికి తెలియదు. ఆ మహనీయుని గురించిన చిన్న పరిచయమే ఈ వ్యాసం. శ్రీ యస్.నటరాజన్ అనే వ్యక్తి 'శారద' గా మారటం వరకు ఆయన జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. శ్రీ ఆలూరి భుజంగరావు గారు వ్రాసిన సాహిత్య బాటసారి--'శారద' అనే జీవిత చరిత్రలో, 'శారద'ను గురించిన కొన్ని విషయాలు చదువుతుంటే, కన్నీళ్లు వచ్చాయి.
తమిళనాడులోని పుదుక్కోట ఆయన జన్మస్థలం. భాగీరధి, సుబ్రహ్మణ్య అయ్యర్లు వీరి తల్లితండ్రులు.1924 లో తల్లి తండ్రులకు ఆఖరివాడిగా, అతి బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారికి పూట గడవటమే కష్టం. అట్టి పరిస్థితులలో,నటరాజన్ జోలెబట్టి మధూకరం తెచ్చుకొని చదువుకుంటమే కాకుండా, తల్లి తండ్రులను కూడా పోషించాడు. ఖాళీ సమయాలలో, దేవాలయాల వద్ద గంధం, విభూతి అమ్మి కొంత ధనాన్ని సంపాదించేవాడు. అతి చిన్న వయసులోనే,ప్రాచీన, ఆధునిక తమిళ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఎక్కువగా హాస్య, వ్యంగ్య రచనలు ఆయనను ఆకట్టుకున్నాయి. సహజంగా ఆయనకు సునిశితమైన హాస్య దృష్టి అబ్బింది.నటరాజన్ తన రెండవ ఏటనే తల్లిని కోల్పోయారు. అక్కలిద్దరినీ తెనాలికి చెందిన వారికిచ్చి వివాహం చేయటంతో, సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ తో తెనాలికే చేరాడు.
1937 లో తెనాలికి వచ్చారు. మొదటినుండీ పుస్తకాలను చదవటం, స్వయంగా కొత్త విషయాలను నేర్చుకోవటం నటరాజన్ కు అలవాటు. అలానే, ఆయన, ఆంగ్ల,ఫ్రెంచి భాషలను నేర్చుకోవటమే కాకుండా, నెమ్మదిగా ఆ భాషల్లో ఉన్న కథలను తమిళంలోకి అనువదించటం ద్వారా, తనలోని రచయితను మేల్కొలిపాడు.తెనాలికి వచ్చినప్పుడు ఆయనకు తెలుగు మాట్లాడటం గానీ,వ్రాయటం గానీ తెలియనే తెలియదు.తెలుగును నేర్చుకోవాలని ఆయనకు ఎంతో ఉబలాటం ఉండేది. కానీ, అతని ముందర ఉన్న సమస్య పొట్టనింపుకోవటం, తండ్రిని పోషించటం. తెనాలిలో మారీసుపేటలో ఉన్న 'ఆంధ్ర రత్నహోటల్ 'లో సర్వర్ గా చేరాడు. (అదే పేరుతో అక్కడ హోటల్ చాలాకాలం వరకూ ఉంది. యాజమాన్యంవారు మారి ఉండవచ్చు.) ఇక తెలుగు నేర్చుకోవటం తప్పని సరి అయింది, హోటల్ కు వచ్చిన వారితో మాట్లాడటం మొదట నేర్చుకున్నాడు. తరువాత స్వయంగా తెలుగు భాషను చదవటం, వ్రాయటం నేర్చుకున్నారు.
ఆ రోజుల్లోనే, ఆయన ఆంగ్ల పత్రికలలోని పజిల్సును పూర్తి చేసేవారు. అలా, చాలా సార్లు బహుమతులు కూడా పొందారు. తెలుగులో ప్రాచీన సాహిత్యం వైపు పోకుండా, ఆధునిక, సమకాలీనపు సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం అలవాటైంది. కొడవటిగంటి, చలం లాంటి వారి సాహిత్యాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. కనిపించిన ప్రతి తెలుగు పుస్తకాన్ని చదివేవారు. అలా నటరాజన్ కాస్తా'శారద' అయ్యాడు. ఆయనకు తెనాలిలో తెలుగు నేర్పిన అధ్యాపకుడు శ్రీ తురగా వెంకటేశ్వరరావుగారు. వారు,'శారద' చేత గజేంద్రమోక్షం, శ్యామలాదండకం లాంటివి కంఠస్తం చేయించారు. శారద,తన పదిహేనవ ఏటనే తండ్రని కూడా పోగొట్టుకున్నాడు. ఏకాకి అయిన 'శారద' తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. ఒక రకమైన షాక్ కు గురయ్యాడు. తండ్రికి దహన సంస్కరణలు చేసిన నాటి రాత్రే మూర్ఛ వ్యాధికి గురయ్యాడు 'శారద'. ఆఖరికి ఆ వ్యాధే అతనిని మృత్యులోకాలకు తీసుకొని వెళ్ళింది. కాలువ పక్క పడిన అతని మృతదేహాన్ని మరుసటి రోజుకు గానీ గుర్తించలేకపోయారు. అలా అర్ధాంతరంగా ముగిసింది 'శారద' జీవితం!ఇక ఆయన రచనా వ్యాసంగ విషయాలకు వస్తే, తొలిసారిగా ఆయన వ్రాసిన వ్యంగ్య రచన 'ప్రపంచానికి జబ్బుచేసింది'. ఇది 1946 లో ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడింది. ఆ రచన వారి సొంత పేరైన యస్.నటరాజన్ పేరు మీదే అచ్చయింది. ఆ రోజుల్లోనే, ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత 'చంద్రిక'ను మొదలు పెట్టారు. అయితే, వాటిని అనారోగ్య పరిస్థితులు, ఆర్ధిక స్తోమత లేకపోవటం వల్ల ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు.
1948 నుండి1955 వరకు అంటే ఏడేళ్ళు మాత్రమే రచనలు చేసారు.తెలుగు స్వతంత్ర, జ్యోతి,హంస వంటి పత్రికలు ఆయనకు మంచి ఊతమిచ్చాయి. ప్రస్తుతం, రక్తస్పర్శ , శారదరచనలు, శారద నవలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా, 'శారద' అభిమానుల పూనికవల్లనే వెలుగు చూసాయి. శారద, రావూరి భరద్వాజ గార్లు దాదాపుగా ఒకే సమయంలో రచనలను ప్రారంభించారు. ఇద్దరి మీదా చలం గారి ప్రభావం పూర్తిగా ఉంది. శారద జీవితమంతా దరిద్రంతోనే గడిచింది. ఒక చేత్తో గారెలు చేసి అమ్ముతూ, మరో చేత్తో 'మంచి-చెడు' అనే నవలను వ్రాసారు. ఎంత దుర్భర పరిస్థితులు ఎదురైనా రచనా వ్యాసంగాన్ని మానలేదు. ఇక అతని శైలి చాలా భిన్నమైనది. ఎంచుకునే కథా వస్తువు విభిన్నంగా ఉండేది. ఈ రెండు లక్షణాలే శారదను తెలుగు సాహితీలోకంలో విశారదుడిగా నిలబెట్టాయి."కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి గార్ల రచనలకు వారధి వంటి వాడు శారద" అని ఆ రోజుల్లోనే సాహితీ ప్రియుల మన్ననలను పొందాడు శారద.
కార్మిక ఉద్యమాలతో సంబంధమున్న ఈయన రచనలలో, కార్మికుల జీవనవిధానం కనపడేది. కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు పొందిన కార్యకర్త. ఇంతటి సాహితీ సుసంపన్నుడైన 'శారద' దుర్భర దారిద్ర్యంతో, మూర్ఛవ్యాధితో,17-08-1955 న, తన 31 ఏటనే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఇదీ, 'శారద నీరదేందు ఘనసార' కన్నీటి కథ. నటరాజన్ అనే తమిళ యువకుడు 'శారద'గా మారిన నిజమైన కథ. 'శారద'జీవితం మరో సత్యాన్ని చెబుతుంది--కష్టాల కొలిమినుండే ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలిదప్పులు,దరిద్రం అతనిని భౌతికంగా బాధపెట్టాయేమో కానీ, అతనిలోని సాహితీ పిపాసను అంటుకోవటానికి, అడ్డుకోవటానికి కూడా అవి భయపడ్డాయి. కేవలం అతను ఒక రచయితే కాదు, తత్వవేత్త, క్రాంతదర్శి, దార్శనికుడు.
తెనాలిలో ఆయన స్మారకచిహ్నాలు లేకపోవటం చాలా విచారకరం. ఆ మహనీయుని ఫోటో కోసం, నా దగ్గరవున్న ఆయన నవలనొక దానికోసం వెదికాను.ఆ నవల వెనకవైపు అట్టమీద ఆయన ఫోటో ఉంది. ఆ నవల కోసం ఎంత వెదికినా కనబడలేదు. "మంచి పుస్తకాలకు రెక్కలు వచ్చి ఎగిరి పోతాయి" అన్న నార్ల వారి మాటలు నిజమే కాబోలు. ఎలాగో ఆయన ఫోటోను సంపాదించాను. తెలుగువారికి మంచి కథలను అందచేయటానికే ఆంధ్రదేశానికి వచ్చిన ఈ విశారదుడికి బాష్పాంజలి!
link: http://www.gotelugu.com/issue48/1353/telugu-columns/sahitee-vi-sarada/
తెలుగు సాహిత్యంలో 'శారద' కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దురదృష్టమేమంటే, 'శారద' అంటే చాలా మందికి తెలియదు. ఆ మహనీయుని గురించిన చిన్న పరిచయమే ఈ వ్యాసం. శ్రీ యస్.నటరాజన్ అనే వ్యక్తి 'శారద' గా మారటం వరకు ఆయన జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. శ్రీ ఆలూరి భుజంగరావు గారు వ్రాసిన సాహిత్య బాటసారి--'శారద' అనే జీవిత చరిత్రలో, 'శారద'ను గురించిన కొన్ని విషయాలు చదువుతుంటే, కన్నీళ్లు వచ్చాయి.
తమిళనాడులోని పుదుక్కోట ఆయన జన్మస్థలం. భాగీరధి, సుబ్రహ్మణ్య అయ్యర్లు వీరి తల్లితండ్రులు.1924 లో తల్లి తండ్రులకు ఆఖరివాడిగా, అతి బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారికి పూట గడవటమే కష్టం. అట్టి పరిస్థితులలో,నటరాజన్ జోలెబట్టి మధూకరం తెచ్చుకొని చదువుకుంటమే కాకుండా, తల్లి తండ్రులను కూడా పోషించాడు. ఖాళీ సమయాలలో, దేవాలయాల వద్ద గంధం, విభూతి అమ్మి కొంత ధనాన్ని సంపాదించేవాడు. అతి చిన్న వయసులోనే,ప్రాచీన, ఆధునిక తమిళ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఎక్కువగా హాస్య, వ్యంగ్య రచనలు ఆయనను ఆకట్టుకున్నాయి. సహజంగా ఆయనకు సునిశితమైన హాస్య దృష్టి అబ్బింది.నటరాజన్ తన రెండవ ఏటనే తల్లిని కోల్పోయారు. అక్కలిద్దరినీ తెనాలికి చెందిన వారికిచ్చి వివాహం చేయటంతో, సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ తో తెనాలికే చేరాడు.
1937 లో తెనాలికి వచ్చారు. మొదటినుండీ పుస్తకాలను చదవటం, స్వయంగా కొత్త విషయాలను నేర్చుకోవటం నటరాజన్ కు అలవాటు. అలానే, ఆయన, ఆంగ్ల,ఫ్రెంచి భాషలను నేర్చుకోవటమే కాకుండా, నెమ్మదిగా ఆ భాషల్లో ఉన్న కథలను తమిళంలోకి అనువదించటం ద్వారా, తనలోని రచయితను మేల్కొలిపాడు.తెనాలికి వచ్చినప్పుడు ఆయనకు తెలుగు మాట్లాడటం గానీ,వ్రాయటం గానీ తెలియనే తెలియదు.తెలుగును నేర్చుకోవాలని ఆయనకు ఎంతో ఉబలాటం ఉండేది. కానీ, అతని ముందర ఉన్న సమస్య పొట్టనింపుకోవటం, తండ్రిని పోషించటం. తెనాలిలో మారీసుపేటలో ఉన్న 'ఆంధ్ర రత్నహోటల్ 'లో సర్వర్ గా చేరాడు. (అదే పేరుతో అక్కడ హోటల్ చాలాకాలం వరకూ ఉంది. యాజమాన్యంవారు మారి ఉండవచ్చు.) ఇక తెలుగు నేర్చుకోవటం తప్పని సరి అయింది, హోటల్ కు వచ్చిన వారితో మాట్లాడటం మొదట నేర్చుకున్నాడు. తరువాత స్వయంగా తెలుగు భాషను చదవటం, వ్రాయటం నేర్చుకున్నారు.
ఆ రోజుల్లోనే, ఆయన ఆంగ్ల పత్రికలలోని పజిల్సును పూర్తి చేసేవారు. అలా, చాలా సార్లు బహుమతులు కూడా పొందారు. తెలుగులో ప్రాచీన సాహిత్యం వైపు పోకుండా, ఆధునిక, సమకాలీనపు సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం అలవాటైంది. కొడవటిగంటి, చలం లాంటి వారి సాహిత్యాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. కనిపించిన ప్రతి తెలుగు పుస్తకాన్ని చదివేవారు. అలా నటరాజన్ కాస్తా'శారద' అయ్యాడు. ఆయనకు తెనాలిలో తెలుగు నేర్పిన అధ్యాపకుడు శ్రీ తురగా వెంకటేశ్వరరావుగారు. వారు,'శారద' చేత గజేంద్రమోక్షం, శ్యామలాదండకం లాంటివి కంఠస్తం చేయించారు. శారద,తన పదిహేనవ ఏటనే తండ్రని కూడా పోగొట్టుకున్నాడు. ఏకాకి అయిన 'శారద' తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. ఒక రకమైన షాక్ కు గురయ్యాడు. తండ్రికి దహన సంస్కరణలు చేసిన నాటి రాత్రే మూర్ఛ వ్యాధికి గురయ్యాడు 'శారద'. ఆఖరికి ఆ వ్యాధే అతనిని మృత్యులోకాలకు తీసుకొని వెళ్ళింది. కాలువ పక్క పడిన అతని మృతదేహాన్ని మరుసటి రోజుకు గానీ గుర్తించలేకపోయారు. అలా అర్ధాంతరంగా ముగిసింది 'శారద' జీవితం!ఇక ఆయన రచనా వ్యాసంగ విషయాలకు వస్తే, తొలిసారిగా ఆయన వ్రాసిన వ్యంగ్య రచన 'ప్రపంచానికి జబ్బుచేసింది'. ఇది 1946 లో ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడింది. ఆ రచన వారి సొంత పేరైన యస్.నటరాజన్ పేరు మీదే అచ్చయింది. ఆ రోజుల్లోనే, ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత 'చంద్రిక'ను మొదలు పెట్టారు. అయితే, వాటిని అనారోగ్య పరిస్థితులు, ఆర్ధిక స్తోమత లేకపోవటం వల్ల ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు.
1948 నుండి1955 వరకు అంటే ఏడేళ్ళు మాత్రమే రచనలు చేసారు.తెలుగు స్వతంత్ర, జ్యోతి,హంస వంటి పత్రికలు ఆయనకు మంచి ఊతమిచ్చాయి. ప్రస్తుతం, రక్తస్పర్శ , శారదరచనలు, శారద నవలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా, 'శారద' అభిమానుల పూనికవల్లనే వెలుగు చూసాయి. శారద, రావూరి భరద్వాజ గార్లు దాదాపుగా ఒకే సమయంలో రచనలను ప్రారంభించారు. ఇద్దరి మీదా చలం గారి ప్రభావం పూర్తిగా ఉంది. శారద జీవితమంతా దరిద్రంతోనే గడిచింది. ఒక చేత్తో గారెలు చేసి అమ్ముతూ, మరో చేత్తో 'మంచి-చెడు' అనే నవలను వ్రాసారు. ఎంత దుర్భర పరిస్థితులు ఎదురైనా రచనా వ్యాసంగాన్ని మానలేదు. ఇక అతని శైలి చాలా భిన్నమైనది. ఎంచుకునే కథా వస్తువు విభిన్నంగా ఉండేది. ఈ రెండు లక్షణాలే శారదను తెలుగు సాహితీలోకంలో విశారదుడిగా నిలబెట్టాయి."కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి గార్ల రచనలకు వారధి వంటి వాడు శారద" అని ఆ రోజుల్లోనే సాహితీ ప్రియుల మన్ననలను పొందాడు శారద.
కార్మిక ఉద్యమాలతో సంబంధమున్న ఈయన రచనలలో, కార్మికుల జీవనవిధానం కనపడేది. కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు పొందిన కార్యకర్త. ఇంతటి సాహితీ సుసంపన్నుడైన 'శారద' దుర్భర దారిద్ర్యంతో, మూర్ఛవ్యాధితో,17-08-1955 న, తన 31 ఏటనే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఇదీ, 'శారద నీరదేందు ఘనసార' కన్నీటి కథ. నటరాజన్ అనే తమిళ యువకుడు 'శారద'గా మారిన నిజమైన కథ. 'శారద'జీవితం మరో సత్యాన్ని చెబుతుంది--కష్టాల కొలిమినుండే ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలిదప్పులు,దరిద్రం అతనిని భౌతికంగా బాధపెట్టాయేమో కానీ, అతనిలోని సాహితీ పిపాసను అంటుకోవటానికి, అడ్డుకోవటానికి కూడా అవి భయపడ్డాయి. కేవలం అతను ఒక రచయితే కాదు, తత్వవేత్త, క్రాంతదర్శి, దార్శనికుడు.
తెనాలిలో ఆయన స్మారకచిహ్నాలు లేకపోవటం చాలా విచారకరం. ఆ మహనీయుని ఫోటో కోసం, నా దగ్గరవున్న ఆయన నవలనొక దానికోసం వెదికాను.ఆ నవల వెనకవైపు అట్టమీద ఆయన ఫోటో ఉంది. ఆ నవల కోసం ఎంత వెదికినా కనబడలేదు. "మంచి పుస్తకాలకు రెక్కలు వచ్చి ఎగిరి పోతాయి" అన్న నార్ల వారి మాటలు నిజమే కాబోలు. ఎలాగో ఆయన ఫోటోను సంపాదించాను. తెలుగువారికి మంచి కథలను అందచేయటానికే ఆంధ్రదేశానికి వచ్చిన ఈ విశారదుడికి బాష్పాంజలి!
Monday, 18 August 2014
Tuesday, 5 August 2014
విలువల్ని నిలదీసే శారద నవలలు by శ్రీశాంతి దుగ్గిరాల
link: http://lopalialalu.blogspot.in/2013/11/blog-post_22.html
Thanks to Srisanthi duggirala for allowing me to post this in this blog.
Thanks to Srisanthi duggirala for allowing me to post this in this blog.
Friday, 22 November 2013
విలువల్ని నిలదీసే శారద నవలలు
శారద గారి అసలు పేరు ఎస్. నటరాజన్ గారు. ఈయన తమిళదేశస్తుడు. పన్నెండేళ్ళప్పుడు తెనాలి వచ్చారు. చిన్ననాటి నుండి తమిళ సాహిత్యంపై మక్కువతో ఆ వయసులోనే పలు రచనలు చదవారు. తనకున్న పఠనాశక్తి వల్ల తెనాలి రాగానే తెలుగు భాష కూడా నేర్చుకొని ఎన్నో రచనలు చదవడమే కాక తోటివారికి చెపుతుండేవారు.
నటరాజన్ గారు తెలుగు భాషలో పలు కథా, నవలా రచనలను చేసారు. వారి మొదటి రచన “ప్రపంచానికి జబ్బు చేసింది”. ఆయన రచనల్లో నేను ప్రస్తుతం చదివింది పర్స్పెక్టివ్స్ వాళ్లు ప్రచురించిన “శారద నవలలు”. ఇందులో మెుత్తం మూడు నవలలు ఉన్నాయి. అవి: “ఏది సత్యం”, “మంచీ చెడు”, “అపస్వరాలు”.
ఏది సత్యం
పార్వతి భర్త సాంబశివరావు. రైసు మిల్లులో సూపర్ వైజర్ గా పనికి కుదిరాడు. వారి సంసారం చక్కగా సాగుతున్న తరుణంలో, సాంబశివరావుకు రైసు మిల్లులో ఒక ప్రమాదం జరిగి కాలు విరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, సుఖంగా సాగుతున్న వారి సంసారంలో కష్టాలు ప్రవేశించాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. సంసార భాధ్యత అమాయకురాలైన పార్వతి పై పడింది. పొరుగింటి వారి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరింది పార్వతి.
పార్వతి ఉద్యోగం చేయడం సాంబశివరావుకు ఇష్టం ఉందదు గానీ, పొరుగు వారి బలవంతం మీద, ఇల్లు గడవడానికి వేరే మార్గం లేక ఒప్పుకుంటాడు. రోజంతా ఇంటిపట్టున ఒంటరిగా గడిపే సాంబశివరావు పార్వతి మీద అకారణంగా ద్వేషాన్నీ, అనుమానాన్నీ పెంచుకున్నాడు. అకారణంగా భార్యని బాధించి కొంత ఆనందించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలోని అనుమానం పెనుభూతమై వారి సంసారాన్ని దహించివేసింది.
అణుకువ, అందం, అమాయకత్వం కలిగిన అమాయకురాలు. భర్తను కాపాడుకోవాలనే ఆశతో ఎన్ని కష్టాలు ఎదురైనా మెుండిగా ఎదిరించింది. శరీరమే కాదు మనసూ అవిటిదని తన చర్యల ద్వారా నిరూపించాడు సాంబశివరావు.
మంచీ చెడు
యాభై ఏళ్ళ భద్రయ్య ఇరవై కూడా నిండని అమ్మాయిని పెళ్ళాడతాడు. భద్రయ్య ఇరవై ఏళ్ళ కుమారుడు భాస్కర్రావు పట్నంలో చదువుకుంటున్నాడు. పెళ్ళి విషయం తెలిసినా తండ్రి నిర్ణయానికి ఎదురు చెప్పలేకపోతాడు. తన కంటే చిన్నదాన్ని తండ్రి పెళ్ళాడటంతో మనసులోనే బాధ పడతాడు.
భద్రయ్య వ్యాపార మిత్రుడు సుదర్శనం. అతని మొదటి భార్య చనిపోయాకా రెండో పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్యతో అతనికి ఒక కూతురు. ఆమె పేరు సరోజిని. కొత్తగా వచ్చిన సవతి తల్లి ఆమెను నానా బాధలు పెడుతుంది. ఒకసారి పొయ్యిలో తోస్తే ఆమె ముఖం కాలి అందవిహీనంగా తయారవుతుంది. అప్పటి నుంచీ తండ్రి సుదర్శనం ఆమెను మేలి ముసుగులో దాచి ఉంచుతాడు. అతను ఆమెను తన స్నేహితుడు భద్రయ్య కొడుకు భాస్కర్రావుకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కాని సరోజిని రూపు నచ్చని భాస్కరం ఆమెను తిరస్కరిస్తాడు. కోపం పట్టలేని సుదర్శనం వారిపై పగ పట్టి వారి ఆస్తిని కాజేస్తాడు.
ఆస్తిపోయి పేదవారుగా మిగిలిన భద్రయ్య కుటుంబానికి కొడుకే ఆదారమౌతాడు. పుండు మీద కారంలా వాళ్ల ఇల్లు కూడా తగలబడటంతో అంతా కట్టు బట్టలతో రోడ్డున పడతారు. భాస్కర్రావు చిన్న బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేస్తూ కుటుంబ బాధ్యత మోస్తాడు. కొన్ని రోజులకు భద్రయ్య కాలం చేస్తాడు.
భద్రయ్య భార్య పద్మ ఆ పేదరికాన్ని భరిచలేక పెడ దారి పడుతుంది. ఫలితంగా గర్భం దాల్చి ఎవరికి కనిపించకుండా వెళిపోతుంది. భాస్కర్రావు ఎన్నో కష్టలు అనుభవించి అందరిలో మంచి పేరు సంపాదించుకుంటాడు. పెడదారి పట్టిన పద్మ జీవితం ఎన్నో చేతులు మారి చివరకు వెలయాలిగా మిగిలిపోతుంది.
ఈ కథకు సమాంతరంగా సుదర్శనం కూతురు సరోజిని కథ కూడా నడుస్తూంటుంది. భాస్కర్రావు కాదన్నాడన్న పట్టుదలతో సుదర్శనం ఆమెను శంకరం అనే అనామకునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అతను దుర్వ్యసనపరుడు. సుదర్శనం డబ్బుకు ఆశపడి సరోజినిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెను నానా బాధలు పెడతాడు. అతని సుఖవ్యాధులన్నీ ఆమెకు సంక్రమించి ఆమె అకాల మరణం చెందుతుంది.
అపస్వరాలు
రంగయ్యగారు తెలుగు పండితుడు. కొడుకు సదానందం మృదు స్వభావం, కళలయందు ఆసక్తి కలవాడు. కూతురు జయ పెళ్ళయినా కట్నం డబ్బులు ఇచ్చుకోలేక పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ మధ్య తరగతి సంసారాన్ని రంగయ్యగారే ఎన్నో ఆర్థిక ఇబ్బందులకోర్చి నెట్టుకొస్తున్నాడు.
రంగయ్య గారి వియ్యంకుడు వకీలు శేషాద్రిరావు ధనవంతుడే అయినా డబ్బు మీది వ్యామోహం చావని వాడు. ఈయన వంశోద్ధారకుడు త్రయంబకరావు. కూతురు రమణమ్మ వైదవ్యంతో పుట్టినింటే ఉంటుంది. తల్లితండ్రులు తమ్ముని సంసారం చేజేతులా నాశనం చేస్తున్నారని గమనించి, ధైర్యంగా వ్యవహరించి భార్యను కాపురానికి తెచ్చుకోమని తమ్ముణ్ణి హెచ్చరిస్తూ ఉంటుంది.
రంగయ్యగారు వచ్చే రెండు వందలూ సరిపోక రచనలు చేస్తూంటాడు. పబ్లిషరు మోసగిస్తాడు. చివరికి ఆయన తన కంటి చూపును కూడా పోగొట్టుకుంటాడు.
వరదరాజులు మరో పాత్ర. రౌడీగా జీవితం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాడు. కానీ తప్పు చేసి సంపాదించిన డబ్బు సుఖాలిచ్చినా మనశ్శాంతిని ఇవ్వలేక పోయింది. ఉన్న డబ్బుతో ఎవరికీ సాయపడడు గానీ, అందరిపై జాలిని ప్రేమను మాత్రం ప్రదర్శిస్తాడు. అది ఎవరికీ అక్కరకు రాదు.
కట్నాల దాహం వల్ల కుటుంబాల్లో సంభవించే అనర్థాలు, చదువు సంధ్యాలేని పబ్లిషర్లు రచయితలపై చూపే అనాదరణ, ఎన్నికల్లో డబ్బును ఎరగాచూపి అక్రమంగా గెలవాలని చూసే రాజకీయ నాయకులు, నాటకాల పేరుతో తమ కళాకారులను వశపరచుకొనే స్వార్థపరులు... ఇలాంటి పాత్రలతో కిక్కిరిసిన ఈ నవల సాటివారి కోసం ఆలోచించలేని సమాజాన్ని చిత్రిస్తుంది.
నా అభిప్రాయం
డబ్బు జీవించడానికి ఎంతో అవసరం, కానీ దాన్ని కష్టించి సంపాదించినపుడే విలువ. అలాక్కాక అన్యాయంగా ధనాన్ని అర్జించటం, ఇంకా ఇంకా అర్జించాలనే పేరాశ, దాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక స్వార్థంతో కరుడుగట్టిపోవటం, పేదవారనే కనికరం లేకపోవడం... ఇలా ధనం వల్ల మనుషుల మనస్తత్వాలు క్రమేణా ఎలా మారతాయో ఈ నవలల్లో చూపిస్తాడు రచయిత. ఆనాటి మధ్యతరగతి సమాజంలో ఆడదానికి ఉన్న విలువను, వారికి జరిగిన అన్యాయాలను ఎత్తి చూపిస్తాడు. సమాజంలో చోటు చేసుకున్న వ్యాపార విలువల నగ్న స్వరూపాన్ని చిత్రిస్తాడు.
శారద నవలలన్నీ ఆయన చుట్టూ ఉన్న ఆనాటి కాలమాన పరిస్థితుల నుండి, ఆయన అనుభవించిన కటిక దారిద్ర్యం నుండి పుట్టినవి గానే తోస్తాయి. తన లాంటి బడుగు జీవుల కథల్నే ఇతివృత్తాలుగా తీసుకున్నాడు. ఆనాటి సమాజంలో అరాచకాన్నీ, అవినీతిని తనదైన బాణిలో ఎదుర్కొన్నాడు.
ఆయన శైలి సరళంగా ఉండి చదివేవారికి కథ తప్ప వేరే ఆలోచన రాకుండా చేస్తుంది. ఎక్కడా తమిళ వాసనలు లేకుండా అచ్చ తెలుగు గుభాళింపులతో సాగుతుంది. తెలుగువాళ్లే తెలుగు సరిగా రాయలేకపోతున్న కాలం ఇది. నేటి తరానికి ఆయన ఒక ప్రేరణగా నిలుస్తాడు.
ఏ వ్యక్తినైనా మన కళ్ళ ముందు ఉండగా వారి గొప్ప తనాన్ని గుర్తించలేని గుడ్డి సమాజంలో జీవిస్తున్నాం మనం. అలా నిర్లక్ష్యానికి గురై చిన్న వయసులోనే చనిపోయిన రచయిత శారద. ఆయన మరణించినా ఆయన చేతి నుండి రాలిన అక్షరాలు మన హృదయ ఫలకాలపై శాశ్వతంగా నిలిచే ఉంటాయి.
నటరాజన్ గారు తెలుగు భాషలో పలు కథా, నవలా రచనలను చేసారు. వారి మొదటి రచన “ప్రపంచానికి జబ్బు చేసింది”. ఆయన రచనల్లో నేను ప్రస్తుతం చదివింది పర్స్పెక్టివ్స్ వాళ్లు ప్రచురించిన “శారద నవలలు”. ఇందులో మెుత్తం మూడు నవలలు ఉన్నాయి. అవి: “ఏది సత్యం”, “మంచీ చెడు”, “అపస్వరాలు”.
ఏది సత్యం
పార్వతి భర్త సాంబశివరావు. రైసు మిల్లులో సూపర్ వైజర్ గా పనికి కుదిరాడు. వారి సంసారం చక్కగా సాగుతున్న తరుణంలో, సాంబశివరావుకు రైసు మిల్లులో ఒక ప్రమాదం జరిగి కాలు విరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, సుఖంగా సాగుతున్న వారి సంసారంలో కష్టాలు ప్రవేశించాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. సంసార భాధ్యత అమాయకురాలైన పార్వతి పై పడింది. పొరుగింటి వారి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరింది పార్వతి.
పార్వతి ఉద్యోగం చేయడం సాంబశివరావుకు ఇష్టం ఉందదు గానీ, పొరుగు వారి బలవంతం మీద, ఇల్లు గడవడానికి వేరే మార్గం లేక ఒప్పుకుంటాడు. రోజంతా ఇంటిపట్టున ఒంటరిగా గడిపే సాంబశివరావు పార్వతి మీద అకారణంగా ద్వేషాన్నీ, అనుమానాన్నీ పెంచుకున్నాడు. అకారణంగా భార్యని బాధించి కొంత ఆనందించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలోని అనుమానం పెనుభూతమై వారి సంసారాన్ని దహించివేసింది.
అణుకువ, అందం, అమాయకత్వం కలిగిన అమాయకురాలు. భర్తను కాపాడుకోవాలనే ఆశతో ఎన్ని కష్టాలు ఎదురైనా మెుండిగా ఎదిరించింది. శరీరమే కాదు మనసూ అవిటిదని తన చర్యల ద్వారా నిరూపించాడు సాంబశివరావు.
మంచీ చెడు
యాభై ఏళ్ళ భద్రయ్య ఇరవై కూడా నిండని అమ్మాయిని పెళ్ళాడతాడు. భద్రయ్య ఇరవై ఏళ్ళ కుమారుడు భాస్కర్రావు పట్నంలో చదువుకుంటున్నాడు. పెళ్ళి విషయం తెలిసినా తండ్రి నిర్ణయానికి ఎదురు చెప్పలేకపోతాడు. తన కంటే చిన్నదాన్ని తండ్రి పెళ్ళాడటంతో మనసులోనే బాధ పడతాడు.
భద్రయ్య వ్యాపార మిత్రుడు సుదర్శనం. అతని మొదటి భార్య చనిపోయాకా రెండో పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్యతో అతనికి ఒక కూతురు. ఆమె పేరు సరోజిని. కొత్తగా వచ్చిన సవతి తల్లి ఆమెను నానా బాధలు పెడుతుంది. ఒకసారి పొయ్యిలో తోస్తే ఆమె ముఖం కాలి అందవిహీనంగా తయారవుతుంది. అప్పటి నుంచీ తండ్రి సుదర్శనం ఆమెను మేలి ముసుగులో దాచి ఉంచుతాడు. అతను ఆమెను తన స్నేహితుడు భద్రయ్య కొడుకు భాస్కర్రావుకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కాని సరోజిని రూపు నచ్చని భాస్కరం ఆమెను తిరస్కరిస్తాడు. కోపం పట్టలేని సుదర్శనం వారిపై పగ పట్టి వారి ఆస్తిని కాజేస్తాడు.
ఆస్తిపోయి పేదవారుగా మిగిలిన భద్రయ్య కుటుంబానికి కొడుకే ఆదారమౌతాడు. పుండు మీద కారంలా వాళ్ల ఇల్లు కూడా తగలబడటంతో అంతా కట్టు బట్టలతో రోడ్డున పడతారు. భాస్కర్రావు చిన్న బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేస్తూ కుటుంబ బాధ్యత మోస్తాడు. కొన్ని రోజులకు భద్రయ్య కాలం చేస్తాడు.
భద్రయ్య భార్య పద్మ ఆ పేదరికాన్ని భరిచలేక పెడ దారి పడుతుంది. ఫలితంగా గర్భం దాల్చి ఎవరికి కనిపించకుండా వెళిపోతుంది. భాస్కర్రావు ఎన్నో కష్టలు అనుభవించి అందరిలో మంచి పేరు సంపాదించుకుంటాడు. పెడదారి పట్టిన పద్మ జీవితం ఎన్నో చేతులు మారి చివరకు వెలయాలిగా మిగిలిపోతుంది.
ఈ కథకు సమాంతరంగా సుదర్శనం కూతురు సరోజిని కథ కూడా నడుస్తూంటుంది. భాస్కర్రావు కాదన్నాడన్న పట్టుదలతో సుదర్శనం ఆమెను శంకరం అనే అనామకునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అతను దుర్వ్యసనపరుడు. సుదర్శనం డబ్బుకు ఆశపడి సరోజినిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెను నానా బాధలు పెడతాడు. అతని సుఖవ్యాధులన్నీ ఆమెకు సంక్రమించి ఆమె అకాల మరణం చెందుతుంది.
అపస్వరాలు
రంగయ్యగారు తెలుగు పండితుడు. కొడుకు సదానందం మృదు స్వభావం, కళలయందు ఆసక్తి కలవాడు. కూతురు జయ పెళ్ళయినా కట్నం డబ్బులు ఇచ్చుకోలేక పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ మధ్య తరగతి సంసారాన్ని రంగయ్యగారే ఎన్నో ఆర్థిక ఇబ్బందులకోర్చి నెట్టుకొస్తున్నాడు.
రంగయ్య గారి వియ్యంకుడు వకీలు శేషాద్రిరావు ధనవంతుడే అయినా డబ్బు మీది వ్యామోహం చావని వాడు. ఈయన వంశోద్ధారకుడు త్రయంబకరావు. కూతురు రమణమ్మ వైదవ్యంతో పుట్టినింటే ఉంటుంది. తల్లితండ్రులు తమ్ముని సంసారం చేజేతులా నాశనం చేస్తున్నారని గమనించి, ధైర్యంగా వ్యవహరించి భార్యను కాపురానికి తెచ్చుకోమని తమ్ముణ్ణి హెచ్చరిస్తూ ఉంటుంది.
రంగయ్యగారు వచ్చే రెండు వందలూ సరిపోక రచనలు చేస్తూంటాడు. పబ్లిషరు మోసగిస్తాడు. చివరికి ఆయన తన కంటి చూపును కూడా పోగొట్టుకుంటాడు.
వరదరాజులు మరో పాత్ర. రౌడీగా జీవితం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాడు. కానీ తప్పు చేసి సంపాదించిన డబ్బు సుఖాలిచ్చినా మనశ్శాంతిని ఇవ్వలేక పోయింది. ఉన్న డబ్బుతో ఎవరికీ సాయపడడు గానీ, అందరిపై జాలిని ప్రేమను మాత్రం ప్రదర్శిస్తాడు. అది ఎవరికీ అక్కరకు రాదు.
కట్నాల దాహం వల్ల కుటుంబాల్లో సంభవించే అనర్థాలు, చదువు సంధ్యాలేని పబ్లిషర్లు రచయితలపై చూపే అనాదరణ, ఎన్నికల్లో డబ్బును ఎరగాచూపి అక్రమంగా గెలవాలని చూసే రాజకీయ నాయకులు, నాటకాల పేరుతో తమ కళాకారులను వశపరచుకొనే స్వార్థపరులు... ఇలాంటి పాత్రలతో కిక్కిరిసిన ఈ నవల సాటివారి కోసం ఆలోచించలేని సమాజాన్ని చిత్రిస్తుంది.
నా అభిప్రాయం
డబ్బు జీవించడానికి ఎంతో అవసరం, కానీ దాన్ని కష్టించి సంపాదించినపుడే విలువ. అలాక్కాక అన్యాయంగా ధనాన్ని అర్జించటం, ఇంకా ఇంకా అర్జించాలనే పేరాశ, దాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక స్వార్థంతో కరుడుగట్టిపోవటం, పేదవారనే కనికరం లేకపోవడం... ఇలా ధనం వల్ల మనుషుల మనస్తత్వాలు క్రమేణా ఎలా మారతాయో ఈ నవలల్లో చూపిస్తాడు రచయిత. ఆనాటి మధ్యతరగతి సమాజంలో ఆడదానికి ఉన్న విలువను, వారికి జరిగిన అన్యాయాలను ఎత్తి చూపిస్తాడు. సమాజంలో చోటు చేసుకున్న వ్యాపార విలువల నగ్న స్వరూపాన్ని చిత్రిస్తాడు.
శారద నవలలన్నీ ఆయన చుట్టూ ఉన్న ఆనాటి కాలమాన పరిస్థితుల నుండి, ఆయన అనుభవించిన కటిక దారిద్ర్యం నుండి పుట్టినవి గానే తోస్తాయి. తన లాంటి బడుగు జీవుల కథల్నే ఇతివృత్తాలుగా తీసుకున్నాడు. ఆనాటి సమాజంలో అరాచకాన్నీ, అవినీతిని తనదైన బాణిలో ఎదుర్కొన్నాడు.
ఆయన శైలి సరళంగా ఉండి చదివేవారికి కథ తప్ప వేరే ఆలోచన రాకుండా చేస్తుంది. ఎక్కడా తమిళ వాసనలు లేకుండా అచ్చ తెలుగు గుభాళింపులతో సాగుతుంది. తెలుగువాళ్లే తెలుగు సరిగా రాయలేకపోతున్న కాలం ఇది. నేటి తరానికి ఆయన ఒక ప్రేరణగా నిలుస్తాడు.
ఏ వ్యక్తినైనా మన కళ్ళ ముందు ఉండగా వారి గొప్ప తనాన్ని గుర్తించలేని గుడ్డి సమాజంలో జీవిస్తున్నాం మనం. అలా నిర్లక్ష్యానికి గురై చిన్న వయసులోనే చనిపోయిన రచయిత శారద. ఆయన మరణించినా ఆయన చేతి నుండి రాలిన అక్షరాలు మన హృదయ ఫలకాలపై శాశ్వతంగా నిలిచే ఉంటాయి.
Subscribe to:
Posts (Atom)











