Friday 26 June 2015

  ఆలూరి భుజంగరావు గారి రెండవ వర్ధంతి సభ:
-----------------------------------------------------

మిత్రులకు !
ది 21-6-15 నాడు గుంటూరు లో ఆలూరి భుజంగరావు గారి రెండవ వర్ధంతి సభను విప్లవ రచయితల సంఘం నిర్వహించింది . విరసం కార్యవర్గ సభ్యురాలు రుక్మిణి గారు అధ్యక్షత వహించారు . డా . మేడిపల్లి రవికుమార్ గారు ''డా . కేశవరెడ్డి సాహిత్యంలో సామాజిక జీవితం''అన్న అంశం పై ప్రసంగించారు . నాన్నగారు ,నేను కలిసి అనువదించిన "వైజ్ఞానిక భౌతికవాదం"గ్రంధాన్ని నేను (కవిని ఆలూరి ) పరిచయం చేయటం జరిగింది .సభకు విచ్చేసిన పెద్దలకూ ,సాహితీ మిత్రులకూ,శ్రేయోభిలాషులకు ధన్యవాదములు.
నాన్న గారు జీవించి ఉన్నప్పుడే ఈ గ్రంధం వెలువడాలని,గ్రందావిష్కరణలో సాహితీ మిత్రులకు ఈ గ్రంధాన్ని గురించి నాన్నగారు చెపుతుంటే నేనూ వినాలనీ అనుకున్నాను .కానీ వాస్తవం వేరుగా ఉంది . గ్రంధ పరిచయాన్ని నేను చేస్తున్నాను ,సాహితీ మిత్రులు అందరూ ఉన్నారు . తెలుగు పాఠకులకు ఈ గ్రంధాన్ని అందించాలని అనుక్షణం తపించిన నాన్న మాత్రం మన మధ్యన లేరు .
--------- కవిని ఆలూరి

---------------------------------------------------------------------------------






No comments:

Post a Comment